ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థుల బాధ్యత మాది
ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థుల బాధ్యత మాది
K.RAVI
* నూతన పాలకవర్గ ప్రోత్సాహం అభినందనీయం
* పీపల్ పహాడ్లో ఘనంగా ‘బడిబాట’.. గడప గడపకూ తిరిగిన ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు
ప్రభుత్వ పాఠశాలల్లో చేరే ప్రతి విద్యార్థి బాధ్యత తమదేనని స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మండల పరిధిలోని పీపల్ పహాడ్ గ్రామంలో బుధవారం ‘బడిబాట’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో అభినందనీయమని వారు కొనియాడారు.గ్రామంలో క్రమం తప్పకుండా రోజూ బడిబాట కార్యక్రమం నిర్వహించటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ముప్పై సంవత్సరాలుగా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని ఈ స్థాయిలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు గడప గడపకూ తిరగడం తామెన్నడూ చూడలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నూతన ఉత్సాహాన్ని చూసి తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు గ్రామ పెద్దలు కూడా తోడై ఇల్లేల్లూ తిరగడం ఈ బడిబాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులనాగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్, వార్డు సభ్యులు ఎర్ర సువర్ణ అంజయ్య, బద్దం సుధాకర్ రెడ్డి, ఎర్ర పూజా పరమేష్, పాఠశాల ఉపాధ్యాయులు ఉమాదేవి, శ్రీదేవి, సురేష్, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, కారోబార్ దానయ్య, గ్రామ పెద్దలు రోషణగారి మల్లయ్య, చీర్క రంగారెడ్డి, బకనగారి బుచ్చయ్య, ఎర్ర యాదయ్య, కామిశెట్టి అభిలాష్, కావ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి