Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రొద్దంలో ఉషశ్రీపై మండల కూటమి నాయకుల ఫైర్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 13, 2026 06:16 PM

ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థుల బాధ్యత మాది

ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థుల బాధ్యత మాది

ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థుల బాధ్యత మాది
June 10, 2026 05:34 PM 161 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* నూతన పాలకవర్గ ప్రోత్సాహం అభినందనీయం

* పీపల్ పహాడ్‌లో ఘనంగా ‘బడిబాట’.. గడప గడపకూ తిరిగిన ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు

ప్రభుత్వ పాఠశాలల్లో చేరే ప్రతి విద్యార్థి బాధ్యత తమదేనని స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మండల పరిధిలోని పీపల్ పహాడ్ గ్రామంలో బుధవారం ‘బడిబాట’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో అభినందనీయమని వారు కొనియాడారు.​గ్రామంలో క్రమం తప్పకుండా రోజూ బడిబాట కార్యక్రమం నిర్వహించటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ముప్పై సంవత్సరాలుగా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని ఈ స్థాయిలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు గడప గడపకూ తిరగడం తామెన్నడూ చూడలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నూతన ఉత్సాహాన్ని చూసి తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు గ్రామ పెద్దలు కూడా తోడై ఇల్లేల్లూ తిరగడం ఈ బడిబాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులనాగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్, వార్డు సభ్యులు ఎర్ర సువర్ణ అంజయ్య, బద్దం సుధాకర్ రెడ్డి, ఎర్ర పూజా పరమేష్, పాఠశాల ఉపాధ్యాయులు ఉమాదేవి, శ్రీదేవి, సురేష్, అంగన్‌వాడీ టీచర్ విజయలక్ష్మి, కారోబార్ దానయ్య, గ్రామ పెద్దలు రోషణగారి మల్లయ్య, చీర్క రంగారెడ్డి, బకనగారి బుచ్చయ్య, ఎర్ర యాదయ్య, కామిశెట్టి అభిలాష్, కావ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News