Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:49 AM

9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభం. చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యం. ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్

9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభం. చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యం. ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్

9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభం. చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యం. ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్
10-06-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చంపాపేట్ డివిజన్ ఉదయ్‌నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ విద్యాసంస్థను మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రీ స్కూల్స్ కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. చిన్న వయస్సులోనే విద్యతో పాటు క్రమశిక్షణ, సృజనాత్మకత, సామాజిక విలువలు అలవడేలా విద్యాబోధన ఉండాలని సూచించారు.

స్కూల్ నిర్వాహకులు సాయి, సునీల్ కుమార్ రెడ్డి, రూపారాణి మాట్లాడుతూ పిల్లలకు కేవలం ఆటలు, పాటలు మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు మొక్కలు నాటించడం, అన్ని మతాల పండుగలను నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. చిన్నారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదిగేలా ప్రత్యేక ఈవెంట్లు నిర్వహిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్, చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సిద్ధాంత్, నూతి శ్రీనివాస్, పద్మారెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభం. చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యం. ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్

Article Image

హైదరాబాద్,

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చంపాపేట్ డివిజన్ ఉదయ్‌నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ విద్యాసంస్థను మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రీ స్కూల్స్ కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. చిన్న వయస్సులోనే విద్యతో పాటు క్రమశిక్షణ, సృజనాత్మకత, సామాజిక విలువలు అలవడేలా విద్యాబోధన ఉండాలని సూచించారు.

స్కూల్ నిర్వాహకులు సాయి, సునీల్ కుమార్ రెడ్డి, రూపారాణి మాట్లాడుతూ పిల్లలకు కేవలం ఆటలు, పాటలు మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు మొక్కలు నాటించడం, అన్ని మతాల పండుగలను నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. చిన్నారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదిగేలా ప్రత్యేక ఈవెంట్లు నిర్వహిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్, చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సిద్ధాంత్, నూతి శ్రీనివాస్, పద్మారెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News