Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూలై 5న ‘రాజ్యాధికార సమరభేరి’ని విజయవంతం చేయాలి యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 09:58 PM

9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభం. చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యం. ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్

9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభం. చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యం. ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్

9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభం. చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యం. ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్
June 10, 2026 07:53 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చంపాపేట్ డివిజన్ ఉదయ్‌నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ విద్యాసంస్థను మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రీ స్కూల్స్ కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. చిన్న వయస్సులోనే విద్యతో పాటు క్రమశిక్షణ, సృజనాత్మకత, సామాజిక విలువలు అలవడేలా విద్యాబోధన ఉండాలని సూచించారు.

స్కూల్ నిర్వాహకులు సాయి, సునీల్ కుమార్ రెడ్డి, రూపారాణి మాట్లాడుతూ పిల్లలకు కేవలం ఆటలు, పాటలు మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు మొక్కలు నాటించడం, అన్ని మతాల పండుగలను నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. చిన్నారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదిగేలా ప్రత్యేక ఈవెంట్లు నిర్వహిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్, చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సిద్ధాంత్, నూతి శ్రీనివాస్, పద్మారెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News