9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభం. చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యం. ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్
9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభం. చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యం. ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ ఈటల రాజేందర్
Editor Desk
హైదరాబాద్,
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చంపాపేట్ డివిజన్ ఉదయ్నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 లండన్ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ విద్యాసంస్థను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రీ స్కూల్స్ కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. చిన్న వయస్సులోనే విద్యతో పాటు క్రమశిక్షణ, సృజనాత్మకత, సామాజిక విలువలు అలవడేలా విద్యాబోధన ఉండాలని సూచించారు.
స్కూల్ నిర్వాహకులు సాయి, సునీల్ కుమార్ రెడ్డి, రూపారాణి మాట్లాడుతూ పిల్లలకు కేవలం ఆటలు, పాటలు మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు మొక్కలు నాటించడం, అన్ని మతాల పండుగలను నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. చిన్నారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదిగేలా ప్రత్యేక ఈవెంట్లు నిర్వహిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్, చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సిద్ధాంత్, నూతి శ్రీనివాస్, పద్మారెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి