Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:09 AM

జూలై 5న ‘రాజ్యాధికార సమరభేరి’ని విజయవంతం చేయాలి

జూలై 5న ‘రాజ్యాధికార సమరభేరి’ని విజయవంతం చేయాలి

జూలై 5న ‘రాజ్యాధికార సమరభేరి’ని విజయవంతం చేయాలి
10-06-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

– చౌటుప్పల్ మండల అధ్యక్షుడు కడతాల యాదగిరి పిలుపు

– జనసమీకరణపై ‘టి.ఆర్.పి’ కీలక సమావేశం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న నిర్వహించ తలపెట్టిన ‘రాజ్యాధికార సమరభేరి’ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ చౌటుప్పల్ మండల అధ్యక్షుడు కడతాల యాదగిరి పిలుపునిచ్చారు. బుధవారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని కళాశ్రీ ఫంక్షన్ హాల్‌లో పార్టీ ముఖ్య నాయకుల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, జనసమీకరణ కార్యాచరణపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ​ఈ సందర్భంగా కడతాల యాదగిరి మాట్లాడుతూ.. రాజ్యాధికార సాధనకై ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. చౌటుప్పల్ మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలోని వార్డుల్లో గల ప్రతి కుల సంఘం అధ్యక్షులకు, కుల పెద్దలకు జూలై 5 సభ ఆహ్వాన పత్రికలను నేరుగా అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమరభేరి సభకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.​ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్యా గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కొమిరిశెట్టి నరసయ్య, చౌటుప్పల్ జనరల్ సెక్రటరీ అరూరి శివ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జూలై 5న ‘రాజ్యాధికార సమరభేరి’ని విజయవంతం చేయాలి

Article Image

– చౌటుప్పల్ మండల అధ్యక్షుడు కడతాల యాదగిరి పిలుపు

– జనసమీకరణపై ‘టి.ఆర్.పి’ కీలక సమావేశం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న నిర్వహించ తలపెట్టిన ‘రాజ్యాధికార సమరభేరి’ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ చౌటుప్పల్ మండల అధ్యక్షుడు కడతాల యాదగిరి పిలుపునిచ్చారు. బుధవారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని కళాశ్రీ ఫంక్షన్ హాల్‌లో పార్టీ ముఖ్య నాయకుల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, జనసమీకరణ కార్యాచరణపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ​ఈ సందర్భంగా కడతాల యాదగిరి మాట్లాడుతూ.. రాజ్యాధికార సాధనకై ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. చౌటుప్పల్ మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలోని వార్డుల్లో గల ప్రతి కుల సంఘం అధ్యక్షులకు, కుల పెద్దలకు జూలై 5 సభ ఆహ్వాన పత్రికలను నేరుగా అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమరభేరి సభకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.​ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్యా గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కొమిరిశెట్టి నరసయ్య, చౌటుప్పల్ జనరల్ సెక్రటరీ అరూరి శివ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News