చౌటుప్పల్ పట్టణాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా
చౌటుప్పల్ పట్టణాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా
K.RAVI
* మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గ్రామసభ బుధవారం ఘనంగా జరిగింది. వార్డు కౌన్సిలర్ ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మున్సిపాలిటీలో పాలన సాగుతోందని, పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.99 రోజుల ప్రణాళికతో వార్డుల రూపురేఖలు మార్చుతాం..అనంతరం వార్డు కౌన్సిలర్ ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. గత 99 రోజుల ప్రణాళికలో భాగంగా వార్డులో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. వార్డులో ఇంకా మిగిలి ఉన్న సమస్యలన్నింటినీ స్థానిక మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ప్రత్యేక నిధుల ద్వారా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని ఆమె పిలుపునిచ్చారు.ఈ గ్రామసభలో స్థానిక ప్రజలు తమ వార్డులోని డ్రైనేజీ, సిసి రోడ్లు, తాగునీరు, వీధి దీపాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు సందగళ్ల విజయ సతీష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, స్థానిక ఎస్సై, విద్యుత్ శాఖ ఏఈ సతీష్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి