PRINT TIME: July 22, 2026 07:27 PM
అత్యవసర సేవలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్ఐ దోమ సుజిత్
అత్యవసర సేవలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్ఐ దోమ సుజిత్
July 22, 2026 05:47 PM
24 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డి గ్రామానికి చెందిన బోజ్గొండ మారుతి మద్యం మత్తులో పలుమార్లు అత్యవసర సేవల 100 నంబర్కు అనవసరంగా ఫోన్ కాల్స్ చేసి పోలీసు సేవలకు అంతరాయం కలిగించినట్లు గుర్తించిన పోలీసులు అతనిపై ఈ-పెట్టి కేసు నమోదు చేశారు. అత్యవసర సేవల నంబర్లు ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం మాత్రమే వినియోగించాలని, సరదా కోసం లేదా మద్యం మత్తులో తప్పుడు కాల్స్ చేయడం చట్టరీత్యా శిక్షార్హమని హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్ తెలిపారు. ప్రజలు అత్యవసర సేవలను బాధ్యతాయుతంగా వినియోగించి పోలీసు సేవలకు ఆటంకం కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి