రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా తిరుమలగిరిలో కాంగ్రెస్ భారీ ధర్నా
రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా తిరుమలగిరిలో కాంగ్రెస్ భారీ ధర్నా
Bandi Kiran Kumar
తిరుమలగిరి;ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆదేశాల మేరకు పట్టణంలోని చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టి నరేంద్ర మోడీదిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తిరుమలగిరి మండలం అధ్యక్షుడు సుంకరి జనార్ధన్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేలా ప్రతిపక్ష నాయకులపై అక్రమ అరెస్టులు చేయడం తగదని, ప్రజల గొంతుకను అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని అన్నారు. అలాగే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రెస్ కన్వీనర్ కందుకూరిలక్ష్మయ్య, పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ జమ్మి లాల్, కాంగ్రెస్ నాయకులు, కడెం మల్లయ్య , యాదగిరి, రాములు నాయక్, సత్యనారాయణ, ఈశ్వర్, సుధాకర్, భాస్కర్, రమేష్ కొండయ్య, యాదగిరి, వీరన్న, లోకేష్ , కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి