Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
22 రోస్టర్ పాయింట్లకు చట్టబద్ధ రక్షణ కల్పించాలి ఎస్సీ వర్గీకరణను యథాతథంగా కొనసాగించాలని నల్గొండలో మాల మహానాడు భారీ నిరసన కోతలేని ‘పోయం’ చికిత్సతో అకాలేషియా బాధితులకు కొత్త ఆశ నల్గొండ మహిళకు యశోదా ఆస్పత్రిలో విజయవంతమైన చికిత్స లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 22, 2026 09:46 PM

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా తిరుమలగిరిలో కాంగ్రెస్ భారీ ధర్నా

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా తిరుమలగిరిలో కాంగ్రెస్ భారీ ధర్నా

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా తిరుమలగిరిలో కాంగ్రెస్ భారీ ధర్నా
July 22, 2026 08:22 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి;ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆదేశాల మేరకు పట్టణంలోని చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టి నరేంద్ర మోడీదిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తిరుమలగిరి మండలం అధ్యక్షుడు సుంకరి జనార్ధన్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేలా ప్రతిపక్ష నాయకులపై అక్రమ అరెస్టులు చేయడం తగదని, ప్రజల గొంతుకను అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని అన్నారు. అలాగే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రెస్ కన్వీనర్ కందుకూరిలక్ష్మయ్య, పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ జమ్మి లాల్, కాంగ్రెస్ నాయకులు, కడెం మల్లయ్య , యాదగిరి, రాములు నాయక్, సత్యనారాయణ, ఈశ్వర్, సుధాకర్, భాస్కర్, రమేష్ కొండయ్య, యాదగిరి, వీరన్న, లోకేష్ , కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News