రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా చిట్యాలలో మోదీ దిష్టిబొమ్మ దహనం
రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా చిట్యాలలో మోదీ దిష్టిబొమ్మ దహనం
Komidala Mahender reddy
చిట్యాల: లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ చిట్యాల పట్టణ కాంగ్రెస్ నాయకులు కనకదుర్గమ్మ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దులపూరి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు.
ఈ సందర్భంగా ఎద్దులపూరి కృష్ణ మాట్లాడుతూ, దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు, అరెస్టులు చేయడం ద్వారా ప్రజల గొంతుకను అణిచివేయలేరని అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీతా రమేష్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పోకల దేవదాస్, జిల్లా నాయకులు పాటి నర్సిరెడ్డి, కౌన్సిలర్ దేశపాక లతా రాజేష్, జెర్రిపోతుల సత్యనారాయణ నాగిళ సుధాకర్, కో-ఆప్షన్ సభ్యుడు బేల్లి సత్తయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి