రోడ్డు భద్రత నిబంధనలు తప్పక పాటించాలి: ఎస్సై
రోడ్డు భద్రత నిబంధనలు తప్పక పాటించాలి: ఎస్సై
Bandi Kiran Kumar
రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత కీలకమని ఎస్సై పేర్కొన్నారు. మండలంలోని తుంగతుర్తి గ్రామంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు. అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.పాదచారులు జీబ్రా క్రాసింగ్ల వద్ద మాత్రమే రోడ్డు దాటాలని, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు సూచికలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనం నడిపే ముందు బ్రేకులు,లైట్లు తదితర భద్రతా పరికరాలను పరిశీలించుకోవాలని తెలిపారు.రోడ్డు భద్రత పోలీసుల ఒక్కరి బాధ్యత కాదని, ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి