రూ.1.50 లక్షల ఎల్వోసీ చెక్కు అందజేసిన సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ఎంతగానో తోడ్పడుతుందని దేవలమ్మనాగారం సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామానికి చెందిన సిలివేరు పద్మమ్మ తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం రూ.1.50 లక్షల విలువైన ఎల్వోసీ (LOC) చెక్కును మంజూరు చేయించారు. ఉపశమనం పొందిన ఈ చెక్కును బుధవారం సర్పంచ్ గౌరీ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో స్పందించి పేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రామాలయ చైర్మన్ పన్నాల రాజిరెడ్డి, ఉప సర్పంచ్ సుర్కంటి అనూప్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి రమేష్, బొమ్మ శ్వేత, బొమ్మ అమరావతి, ఫాతిమా, దోనూరి కిరణ్ రెడ్డి, పాక రాము, సుంకరి శ్రీను, దేశట్ల చైతన్య, రాసాల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి