Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దండు మల్కాపురంలో గ్రామసభ రసాభాస కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 04, 2026 11:05 PM

భారీ వర్షాలు.. అప్రమత్తతే ప్రాణరక్షణ: ప్రజలకు ఎస్సై దుర్గా రెడ్డి కీలక సూచనలు

భారీ వర్షాలు.. అప్రమత్తతే ప్రాణరక్షణ: ప్రజలకు ఎస్సై దుర్గా రెడ్డి కీలక సూచనలు

భారీ వర్షాలు.. అప్రమత్తతే ప్రాణరక్షణ: ప్రజలకు ఎస్సై దుర్గా రెడ్డి కీలక సూచనలు
August 04, 2026 08:01 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కంగ్టి పోలీస్ స్టేషన్ ఎస్సై దుర్గా రెడ్డి సూచించారు. వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపానికి వెళ్లకుండా ఉండాలని, వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. పాత ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న భవనాలు, పూరి గుడిసెల్లో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, చిన్నారులను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. రైతులు కూడా ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో చెట్ల కింద నిలబడకుండా, వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ప్రమాదం, రహదారులు దెబ్బతినడం, చెట్లు కూలిపోవడం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే కంగ్టి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రతే పోలీసు శాఖకు అత్యంత ముఖ్యమని, అధికారుల సూచనలు పాటిస్తూ పరస్పరం సహకరించి వర్షాకాలాన్ని సురక్షితంగా ఎదుర్కోవాలని ఎస్సై దుర్గా రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News