సూర్యాపేట, పట్టణంలోని 30వ వార్డులో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో ప్రజా సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. స్థానిక ప్రజలు సూచిస్తున్న అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి