సంస్థాన్ నారాయణపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ.
సంస్థాన్ నారాయణపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ.
Editor Desk
రికార్డులు, పరిశుభ్రత, ప్రజా సేవలపై ప్రత్యేక దృష్టి.. సిబ్బందికి పలు సూచనలు.
యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అక్షాన్ష్ యాదవ్ (ఐపీఎస్) మంగళవారం సంస్థాన్ నారాయణపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీ బుక్తో పాటు వివిధ రికార్డులను పరిశీలించిన ఎస్పీ.. నమోదు ప్రక్రియ నిబంధనల మేరకు జరుగుతోందా లేదా అనే అంశాన్ని తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పరిశుభ్రత, నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది పనితీరును సమీక్షించారు.
తనిఖీ సందర్భంగా ఎస్హెచ్వో జగన్ పోలీస్ స్టేషన్ పనితీరు, చేపడుతున్న కార్యక్రమాలు, ప్రస్తుత పరిస్థితులపై ఎస్పీకి వివరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లో క్రమశిక్షణ, రికార్డుల సమర్థవంతమైన నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, ప్రజలకు అనుకూలమైన పోలీసింగ్ను అమలు చేయాలని ఆదేశించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి