సైబర్ మోసాలపై జాగ్రత్త! సీఐ మన్మధ కుమార్
సైబర్ మోసాలపై జాగ్రత్త! సీఐ మన్మధ కుమార్
K.RAVI
కాలేజీ విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన
సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి ఉపయోగించాలి తప్ప సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ సూచించారు. మంగళవారం బంగారిగడ్డలోని 'టిజిఆర్ఎస్ అండ్ జూనియర్ కాలేజీ'లో విద్యార్థులకు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్లు, బెట్టింగ్ యాప్లు, ఫేక్ యూపీఐ లింకులు, సోషల్ మీడియా మోసాలు, 'డిజిటల్ అరెస్ట్' పేరిట ముఠాలు వేధిస్తున్నాయని, వీటి పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫేక్ కాల్స్, లింకులను నమ్మవద్దని, ఓటీపీ, పిన్ నంబర్లు, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. వ్యక్తిగత ఫోటోలు, సమాచారాన్ని సోషల్ మీడియాలో పంపవద్దన్నారు. పొరపాటున సైబర్ నేరాలకు గురై డబ్బులు పోగొట్టుకుంటే భయపడకుండా వెంటనే 1930 ఉచిత హెల్ప్లైన్ నంబర్కు లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి