Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకారంలో మళ్లీ మానవత్వం ఓడిందా..? కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 04, 2026 03:44 PM

ఉద్యమకారులకు అండగా ఉంటా: విప్ వేముల వీరేశం

ఉద్యమకారులకు అండగా ఉంటా: విప్ వేముల వీరేశం

ఉద్యమకారులకు అండగా ఉంటా: విప్ వేముల వీరేశం
August 04, 2026 01:48 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంను తెలంగాణ సీనియర్ ఉద్యమ నాయకుడు పోలేపల్లి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఇటీవల క్యాబినెట్ హోదా లభించిన సందర్భంగా శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పోలేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన నిజమైన ఉద్యమకారులను గుర్తించి, వారికి ప్రభుత్వం ద్వారా తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విప్ వేముల వీరేశాన్ని కోరారు. ఉద్యమకారుడిగా ఈ బాధ్యతను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

దీనికి స్పందించిన విప్ వేముల వీరేశం, కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని, ఉద్యమకారుల తరఫున తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పోకల అశోక్ తో పాటు పలువురు ఉద్యమ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News