PRINT TIME: August 04, 2026 07:44 AM
చౌటుప్పల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
చౌటుప్పల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
August 04, 2026 05:52 AM
5 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని 1, 3వ వార్డుల్లో నూతన డ్రైనేజీ నిర్మాణాలు, 19వ వార్డులో డ్రెయిన్ పై స్లాబ్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ సోమవారం భూమి పూజ చేసి ప్రారంభించారు.
స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక కౌన్సిలర్లు, అధికారులతో కలిసి ఈ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డుల్లోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి, పురపాలక సమగ్ర అభివృద్ధికి పాలకవర్గం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు పల్లె లావణ్య, రాకేష్ రెడ్డి, మధుసూదన్, చిరంజీవి, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి