Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భువనగిరి వినాయక చౌరస్తాలో 72 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి... కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 04, 2026 07:44 AM

చౌటుప్పల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చౌటుప్పల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చౌటుప్పల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
August 04, 2026 05:52 AM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని 1, 3వ వార్డుల్లో నూతన డ్రైనేజీ నిర్మాణాలు, 19వ వార్డులో డ్రెయిన్ పై స్లాబ్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ సోమవారం భూమి పూజ చేసి ప్రారంభించారు.

​స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక కౌన్సిలర్లు, అధికారులతో కలిసి ఈ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డుల్లోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి, పురపాలక సమగ్ర అభివృద్ధికి పాలకవర్గం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు పల్లె లావణ్య, రాకేష్ రెడ్డి, మధుసూదన్, చిరంజీవి, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News