క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి: గొరిగే సోములు
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి: గొరిగే సోములు
Editor Desk
ఆగస్టు 10 ‘జైల్ భరో’ను విజయవంతం చేయాలి
కక్కిరేణి, ఆగస్టు 3 (ప్రతినిధి): క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 10న నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే సోములు పిలుపునిచ్చారు.
సోమవారం కక్కిరేణి గ్రామంలో కార్మికులతో కలిసి జైల్ భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య సమరంలో కీలక ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమం దేశ ప్రజలకు పోరాట స్ఫూర్తి, ఐక్యతను చాటిచెప్పిందన్నారు. అదే స్ఫూర్తితో నేడు ప్రజా సమస్యల పరిష్కారం, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువత హక్కుల పరిరక్షణ కోసం ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజా, వర్గ సంఘాల నాయకులు కన్నెబోయిన యాదయ్య, వేముల సైదులు, గ్రామ కార్మికులు బడే సత్తయ్య, కోట వెంకన్న, కిన్నెర రమేష్, కట్ట భిక్షం, నర్సింహ, యశోద తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి