Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి.. భీమ్రా గ్రామసభలో వ్యవసాయ అధికారుల సూచనలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 03, 2026 08:04 PM

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి: గొరిగే సోములు

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి: గొరిగే సోములు

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి: గొరిగే సోములు
August 03, 2026 05:03 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆగస్టు 10 ‘జైల్ భరో’ను విజయవంతం చేయాలి

కక్కిరేణి, ఆగస్టు 3 (ప్రతినిధి): క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 10న నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే సోములు పిలుపునిచ్చారు.


సోమవారం కక్కిరేణి గ్రామంలో కార్మికులతో కలిసి జైల్ భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య సమరంలో కీలక ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమం దేశ ప్రజలకు పోరాట స్ఫూర్తి, ఐక్యతను చాటిచెప్పిందన్నారు. అదే స్ఫూర్తితో నేడు ప్రజా సమస్యల పరిష్కారం, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువత హక్కుల పరిరక్షణ కోసం ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.


ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


ఈ కార్యక్రమంలో ప్రజా, వర్గ సంఘాల నాయకులు కన్నెబోయిన యాదయ్య, వేముల సైదులు, గ్రామ కార్మికులు బడే సత్తయ్య, కోట వెంకన్న, కిన్నెర రమేష్, కట్ట భిక్షం, నర్సింహ, యశోద తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News