PRINT TIME: August 03, 2026 01:33 PM
నార్కట్పల్లి డిపో అధ్యక్షుడిగా ఎలుకరాజు నరసింహ ఎన్నిక
నార్కట్పల్లి డిపో అధ్యక్షుడిగా ఎలుకరాజు నరసింహ ఎన్నిక
August 03, 2026 10:12 AM
14 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన ఎలుకరాజు నరసింహ నార్కట్పల్లి డిపో అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల రజక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వెలిమినేడు గ్రామంలో రజక సంఘం చైర్మన్ గోలి కిష్టయ్య నరసింహను అభినందించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ పదవిలో సమర్థవంతంగా పనిచేస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.నరసింహ ఎన్నికతో వెలిమినేడు గ్రామానికి గుర్తింపు లభించిందని, ఆయన నాయకత్వంలో సంఘం మరింత పురోగతి సాధిస్తుందని రజక సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, సభ్యులు నరసింహకు అభినందనలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి