Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తిమ్మాపూర్‌కు చెందిన వ్యక్తి అదృశ్యం.. ఆచూకీ తెలిపితే పోలీసులకు సమాచారం ఇవ్వండి కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 01, 2026 09:44 PM

బస్సు ఎక్కుతున్న వారే టార్గెట్‌..! ముగ్గురు జేబుదొంగలు అరెస్ట్ ఐఫోన్‌, మోటరోలా సెల్‌ఫోన్లు స్వాధీనం.. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలింపు.

బస్సు ఎక్కుతున్న వారే టార్గెట్‌..! ముగ్గురు జేబుదొంగలు అరెస్ట్ ఐఫోన్‌, మోటరోలా సెల్‌ఫోన్లు స్వాధీనం.. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలింపు.

బస్సు ఎక్కుతున్న వారే టార్గెట్‌..! ముగ్గురు జేబుదొంగలు అరెస్ట్ ఐఫోన్‌, మోటరోలా సెల్‌ఫోన్లు స్వాధీనం.. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలింపు.
August 01, 2026 07:35 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగోల్: బస్సులు ఎక్కే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని సెల్‌ఫోన్లు అపహరిస్తున్న ముగ్గురు అలవాటు నేరస్తులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక ఐఫోన్‌, ఒక మోటరోలా సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం.. జూలై 31న నాగోల్ చౌరస్తాలోని బస్‌స్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్న నారాయణ రాజ్‌కుమార్‌, వెంకటాచారి బస్సు ఎక్కుతున్న సమయంలో కావడి శివ (22) వారిని మాటల్లో పెట్టి దృష్టి మరల్చాడు. అదే సమయంలో అతనితో పాటు ఉన్న మేకల జగపతి బాబు అలియాస్ జగపతి, బోయ అలియాస్ గారడీ మంజునాథ్ అలియాస్ మంజు వారి జేబుల్లోని రెండు సెల్‌ఫోన్లను అపహరించి పరారయ్యారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 1న నాగోల్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి దొంగిలించిన ఐఫోన్‌, మోటరోలా సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో ప్రధాన నిందితుడు మేకల జగపతి బాబుపై వివిధ పోలీస్‌స్టేషన్లలో ఏడు సెల్‌ఫోన్ చోరీ కేసులు, బోయ అలియాస్ గారడీ మంజునాథ్‌పై నాలుగు చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు నాగోల్ పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News