బస్సు ఎక్కుతున్న వారే టార్గెట్..! ముగ్గురు జేబుదొంగలు అరెస్ట్ ఐఫోన్, మోటరోలా సెల్ఫోన్లు స్వాధీనం.. కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలింపు.
బస్సు ఎక్కుతున్న వారే టార్గెట్..! ముగ్గురు జేబుదొంగలు అరెస్ట్ ఐఫోన్, మోటరోలా సెల్ఫోన్లు స్వాధీనం.. కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలింపు.
Editor Desk
నాగోల్: బస్సులు ఎక్కే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని సెల్ఫోన్లు అపహరిస్తున్న ముగ్గురు అలవాటు నేరస్తులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక ఐఫోన్, ఒక మోటరోలా సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. జూలై 31న నాగోల్ చౌరస్తాలోని బస్స్టాండ్లో బస్సు కోసం వేచి ఉన్న నారాయణ రాజ్కుమార్, వెంకటాచారి బస్సు ఎక్కుతున్న సమయంలో కావడి శివ (22) వారిని మాటల్లో పెట్టి దృష్టి మరల్చాడు. అదే సమయంలో అతనితో పాటు ఉన్న మేకల జగపతి బాబు అలియాస్ జగపతి, బోయ అలియాస్ గారడీ మంజునాథ్ అలియాస్ మంజు వారి జేబుల్లోని రెండు సెల్ఫోన్లను అపహరించి పరారయ్యారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 1న నాగోల్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి దొంగిలించిన ఐఫోన్, మోటరోలా సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో ప్రధాన నిందితుడు మేకల జగపతి బాబుపై వివిధ పోలీస్స్టేషన్లలో ఏడు సెల్ఫోన్ చోరీ కేసులు, బోయ అలియాస్ గారడీ మంజునాథ్పై నాలుగు చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు నాగోల్ పోలీసులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి