Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ మార్గంలో ఘోర ప్రమాదం.. బైక్ అదుపు తప్పి ఇద్దరి మృతి కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 01, 2026 09:41 PM

40 ఏళ్ల సంప్రదాయానికి మళ్లీ శ్రీకారం. వారాసిగూడలో నేడు గంగపుత్రుల బోనాల సందడి. 100 బోనాలతో భూలక్ష్మి ఆలయం నుంచి కట్ట మైసమ్మ వరకు శోభాయాత్ర

40 ఏళ్ల సంప్రదాయానికి మళ్లీ శ్రీకారం. వారాసిగూడలో నేడు గంగపుత్రుల బోనాల సందడి. 100 బోనాలతో భూలక్ష్మి ఆలయం నుంచి కట్ట మైసమ్మ వరకు శోభాయాత్ర

40 ఏళ్ల సంప్రదాయానికి మళ్లీ శ్రీకారం. వారాసిగూడలో నేడు గంగపుత్రుల బోనాల సందడి. 100 బోనాలతో భూలక్ష్మి ఆలయం నుంచి కట్ట మైసమ్మ వరకు శోభాయాత్ర
August 01, 2026 07:31 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

పూజా సామగ్రి ఉచితం.. గంగపుత్రులందరికీ నిర్వాహకుల పిలుపు.

సికింద్రాబాద్

: వారాసిగూడ గంగపుత్ర జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం గంగపుత్రులు నిర్వహించిన సంప్రదాయ బోనాల వేడుకను తిరిగి పునరుద్ధరిస్తుండటంతో సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గంగపుత్ర సంఘాలు, సొసైటీలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో పాల్గొననున్నారు. వారాసిగూడ భూలక్ష్మి దేవాలయం నుంచి చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయం వరకు సుమారు 100 బోనాలతో భారీ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది.

అమ్మవారికి సమర్పించే బోనాల కోసం అవసరమైన బిందెలు, పూజా సామగ్రిని గంగపుత్ర జేఏసీ ఉచితంగా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గంగపుత్రులందరూ కుటుంబ సమేతంగా హాజరై బోనాల ఉత్సవాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. భక్తిశ్రద్ధలతో పాటు పాత సంప్రదాయాలకు ప్రతీకగా ఈ వేడుక నిలవనుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News