విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి. రత్నకుమారి
విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి. రత్నకుమారి
Editor Desk
రామన్నపేట
విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకొని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి. రత్నకుమారి అన్నారు. రామన్నపేట మండల పరిధిలోని వెల్లంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి సురేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకురావడం సాధ్యమవుతుందని, సమస్యలు ఎదురైనప్పుడు చట్టబద్ధంగా పరిష్కారం పొందే దిశగా అడుగులు వేయాలన్నారు.విద్యా హక్కు చట్టం, బాల కార్మిక నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధం, పోక్సో చట్టం, కార్మిక చట్టాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎలాంటి సమస్య ఎదురైనా స్థానిక పోలీస్స్టేషన్ లేదా మండల న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని, ఎవరూ అధైర్యపడవద్దని చెప్పారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి ఆలోచనలతో జీవితంలో ముందుకు సాగాలని, హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించాలని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఏ మజీద్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్లు మొగలయ్య, ఎన్. స్వామి, ప్యానల్ అడ్వకేట్లు కూనూరు శ్రీనివాస్, సోమ శ్రీనివాస్ రెడ్డి, పాల్వంచ జగతయ్య, నరసింహ, ఎంఏ అజీమ్, లీగల్ సర్వీసెస్ టీమ్ సభ్యుడు బత్తుల గణేష్, అగ్రి క్లినిక్ సభ్యుడు కానుగంటి శ్రీశైలం, అధ్యాపకులు, కోర్టు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి