Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారీ వర్షంతో గోడలు, పైకప్పు కూలిన ఇల్లు.. బాధితులను పరామర్శించిన సర్పంచ్ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 01, 2026 06:44 PM

రోడ్డు విస్తరణలో బాధితులకు న్యాయం చేయాలి. ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసిన మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

రోడ్డు విస్తరణలో బాధితులకు న్యాయం చేయాలి. ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసిన మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

రోడ్డు విస్తరణలో బాధితులకు న్యాయం చేయాలి. ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసిన మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి
August 01, 2026 04:01 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: హయత్‌నగర్–తారమతిపేట్ 100 అడుగుల రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయే ప్రమాదంలో ఉన్న బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కోరారు. శుభోదయ కాలనీకి చెందిన బాధితులతో కలిసి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. మదర్ డెయిరీ సమీపంలో ప్రభుత్వం గతంలో కేటాయించిన 60 గజాల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రతిపాదిత 100 అడుగుల రోడ్డు విస్తరణతో తమ ఇళ్లు పూర్తిగా ప్రభావితమవుతున్నాయని, దీంతో వందకు పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు విస్తరణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఎదురుగా ఉన్న ఖాళీ ప్రభుత్వ భూమి వైపు నుంచి విస్తరణ చేపట్టి తమ ఇళ్లను కాపాడాలని ఎంపీని కోరారు.

వినతిని స్వీకరించిన ఎంపీ ఈటల రాజేందర్.. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేయకుండా, వారి ఇళ్లు, జీవనాధారం దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. శుభోదయ కాలనీ వాసులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, బాధిత కుటుంబాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News