శేష జీవితం సంతోషంగా గడపాలి: రిటైర్డ్ పోలీసులకు సీపీ సుమతి సూచన
శేష జీవితం సంతోషంగా గడపాలి: రిటైర్డ్ పోలీసులకు సీపీ సుమతి సూచన
Editor Desk
రంగారెడ్డి, జూలై 31:
పోలీసు శాఖలో ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆకాంక్షించారు. పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులను శుక్రవారం సీపీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఉద్యోగ జీవితంలో పోలీసు శాఖకు అందించిన సేవలు, అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన సిబ్బందికి ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని పదవీ విరమణ ప్రయోజనాలు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రిటైర్డ్ ఉద్యోగులు తమ అనుభవాన్ని సమాజ సేవకు వినియోగించాలని, ఆరోగ్యంగా ఉంటూ సమాజానికి తమ వంతు సేవలు కొనసాగించాలని సూచించారు. వారి నిబద్ధత, సేవాభావానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిరా, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ నరసింహారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ (అడ్మిన్) రవీందర్ రెడ్డి, సీఏఓలు శ్రీనివాస్, శ్రీనివాస్, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్. భద్రారెడ్డి, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి