రేపటితో ప్రారంభమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు.. తల్లిపాలపై అవగాహన పెంపొందిద్దాం
రేపటితో ప్రారంభమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు.. తల్లిపాలపై అవగాహన పెంపొందిద్దాం
Krishna
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి తల్లి తన శిశువుకు పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలని సూచించారు. పుట్టిన వెంటనే వచ్చే తొలి పాలు శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని పెంచే అమూల్యమైన ఆహారమని తెలిపారు. మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల శిశువుకు అవసరమైన అన్ని పోషకాలు అందడంతో పాటు విరేచనాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని చెప్పారు. తల్లిపాలు శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో దోహదపడటంతో పాటు తల్లి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది తల్లిపాల వారోత్సవం "జీవితానికి స్థిరమైన ప్రారంభం కోసం తల్లిపాలు – ఇప్పటికే ఫలితాలిస్తున్న చర్యలను మరింత బలోపేతం చేద్దాం" అనే అంశంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబం తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి, బాలింతలకు అవసరమైన సహకారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన భావితరాల నిర్మాణానికి తోడ్పడాలని జిల్లా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి