మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
Editor Desk
నాగోల్, జూలై 30: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ సమీపంలోని మూసీ నదిలో గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మృతదేహం నీటిలో తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని నది నుంచి బయటకు తీసి పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు. అతని ఎడమ చేతిపై "RM" అనే పచ్చబొట్టు ఉండగా, గుండ్రటి ముఖం, చామనచాయ కలిగి ఉన్నట్లు గుర్తించారు. మృతుడు నలుపు రంగు లుంగీ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతనిని గుర్తించగలిగిన వారు చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓను 8712662358 నంబర్లో సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి