Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామ భద్రతకు సీసీ కెమెరాలే కవచం- డిఎస్పీ మధుసూదన్ రెడ్డి కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 31, 2026 07:37 PM

మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
July 31, 2026 09:44 AM 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగోల్, జూలై 30: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ సమీపంలోని మూసీ నదిలో గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మృతదేహం నీటిలో తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని నది నుంచి బయటకు తీసి పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు. అతని ఎడమ చేతిపై "RM" అనే పచ్చబొట్టు ఉండగా, గుండ్రటి ముఖం, చామనచాయ కలిగి ఉన్నట్లు గుర్తించారు. మృతుడు నలుపు రంగు లుంగీ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతనిని గుర్తించగలిగిన వారు చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను 8712662358 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News