Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’పై అవగాహన! కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 30, 2026 10:36 PM

రేషన్ కార్డుల ధ్రువీకరణ గడువును పొడిగించాలి; సీతయ్య

రేషన్ కార్డుల ధ్రువీకరణ గడువును పొడిగించాలి; సీతయ్య

రేషన్ కార్డుల ధ్రువీకరణ గడువును పొడిగించాలి; సీతయ్య
July 30, 2026 08:26 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి: రేషన్ కార్డుల ధ్రువీకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన గడువు శుక్రవారంతో ముగియనున్నందున దానిని మరింత పొడిగించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ కార్డుల ధ్రువీకరణను ఒక నిర్దిష్ట గడువుతో పరిమితం చేయకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని అన్నారు. ఇంకా ధ్రువీకరణ పూర్తి చేయించుకోలేని కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు కూడా రేషన్ సరుకులను అందించాలని డిమాండ్ చేశారు.సాంకేతిక సమస్యలు, అవగాహన లోపం, ఇతర కారణాలతో అనేక మంది లబ్ధిదారులు ధ్రువీకరణ పూర్తి చేయలేకపోయారని, అలాంటి వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి గడువును పొడిగించాలని తాటికొండ సీతయ్య విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News