చిట్యాలలో పరిశ్రమల కాలుష్యంపై బీఆర్ఎస్ ఆందోళన.. కమిషనర్కు వినతి
చిట్యాలలో పరిశ్రమల కాలుష్యంపై బీఆర్ఎస్ ఆందోళన.. కమిషనర్కు వినతి
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఎంఫీఎల్ (MPL) సహా పలు పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుర్వాసన, కాలుష్య పొగ ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్వాసకోశ సమస్యలు, కళ్ల మంటలు, తలనొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ గురువారం మున్సిపల్ కమిషనర్ గురులింగంకు వినతిపత్రం సమర్పించారు.కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలిసి పరిశ్రమలను వెంటనే తనిఖీ చేసి, కాలుష్య నియంత్రణ పరికరాల పనితీరును పరిశీలించాలని, నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళల్లో దుర్వాసన వెదజల్లుతున్న పరిశ్రమలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించిన బీఆర్ఎస్ నాయకులు, పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి