Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల లో ఆగస్టు 6 నుండి ఉచిత యోగ శిక్షణా తరగతులు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 29, 2026 06:00 PM

సూర్యాపేటలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

సూర్యాపేటలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

సూర్యాపేటలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
July 29, 2026 03:57 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు మొరిశెట్టి లక్షాది తెలిపారు.

పట్టణానికి తాగునీరు అందించే వాటర్ ట్యాంకులు, ఫిల్టర్ బెడ్‌లను పరిశీలించి, వాటిని పునరుద్ధరించి ప్రజలకు నాణ్యమైన తాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నిరంతరాయంగా సమృద్ధిగా తాగునీరు అందించేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

పట్టణంలో తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, అవసరమైన చోట్ల పైప్‌లైన్ల విస్తరణ, మరమ్మతులు, నీటి సరఫరా వ్యవస్థ బలోపేతం వంటి పనులు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, "సూర్యాపేటలో ప్రతి కుటుంబానికి నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే మా లక్ష్యం" అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, ధారవత్ వీరన్న నాయక్, కౌన్సిలర్లు సండ్రపాటి విజయ్ కుమార్, బండారు మంగమ్మ, కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, షేక్ జహీర్, గుణగంటి హేమ సతీష్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లింగా నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగేల్లి అరుణ్ కుమార్, సాజిద్ ఖాన్, నరేందర్ నాయుడు, రాచకొండ శ్రీనివాస్, సైదిరెడ్డి (మార్బుల్), జూలకంటి నాగరాజు, జిన్నా చంద్రారెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News