Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల లో ఆగస్టు 6 నుండి ఉచిత యోగ శిక్షణా తరగతులు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 29, 2026 05:47 PM

గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
July 29, 2026 03:57 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట పట్టణంలోని శ్రీ సాయిబాబా మందిరంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయిబాబాను దర్శించుకుని సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గురువే జ్ఞానానికి మార్గదర్శి అని, గురుపౌర్ణమి గురువు మహోన్నత స్థానాన్ని స్మరించుకునే పవిత్రమైన రోజని పేర్కొన్నారు. గురువుల బోధనలు వ్యక్తిత్వ వికాసంతో పాటు సమాజ అభ్యున్నతికి కూడా ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ గురువులను గౌరవిస్తూ వారు చూపిన సన్మార్గంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.


కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మండల పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, స్థానిక కౌన్సిలర్ కొనతం రాజేష్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, షేక్ జహీర్, గుణగంటి హేమ సతీష్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బెలిడే శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగేల్లి అరుణ్ కుమార్, నరేష్ పిళ్లే, రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News