Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేత కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 29, 2026 08:28 PM

పెద్దకాపర్తిలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

పెద్దకాపర్తిలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

పెద్దకాపర్తిలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
July 29, 2026 06:30 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురు పౌర్ణమి వేడుకలను ఉపాధ్యాయులు స్థానిక నాయకులు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీటం శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ విద్యా కమిటీ వైస్ చైర్మన్ నీలకంఠం నరేష్ పాల్గొని ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ​ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువుల పాత్ర సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమని, గురువులను గౌరవించడం భారతీయ సంప్రదాయమని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు తాటి చంద్రమౌళి, పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జరి యాదగిరితో పాటు ఉపాధ్యాయులు కైలాసం, లచ్చిరెడ్డి, విజయలక్ష్మి, రవీందర్, యశోదరా రెడ్డి, రాధా, శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News