Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల లో ఆగస్టు 6 నుండి ఉచిత యోగ శిక్షణా తరగతులు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 29, 2026 06:00 PM

పరిశ్రమల్లో స్థానికులకు 70% ఉద్యోగాలు ఇవ్వాలి

పరిశ్రమల్లో స్థానికులకు 70% ఉద్యోగాలు ఇవ్వాలి

పరిశ్రమల్లో స్థానికులకు 70% ఉద్యోగాలు ఇవ్వాలి
July 29, 2026 03:57 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బిసీవై పార్టీ ప్యాక్ సభ్యుడు శ్రీనివాస్ యాదవ్

చౌటుప్పల్ మండల పరిధిలోని పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు 70 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, లేనిపక్షంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమాలు చేపడతామని బిసీవై పార్టీ తెలంగాణ ప్యాక్ సభ్యులు డా. చిలకల శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

​పరిశ్రమలు స్థానిక ప్రజల భూములు, నీరు, విద్యుత్ వంటి మౌలిక వనరులను వాడుకుంటూ కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నప్పటికీ, ఉపాధి కల్పనలో తీవ్ర అలసత్వం వహిస్తున్నాయని మండిపడ్డారు. కంపెనీల ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్ల చదువుకున్న స్థానిక యువత వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిశ్రమలు సామాజిక బాధ్యతతో వ్యవహరించి స్థానికులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ​అలాగే కార్మిక, అగ్నిమాపక, పర్యావరణ భద్రతా నిబంధనలను పాటించని పరిశ్రమలపై అధికారులు తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) నిధులను స్థానిక గ్రామాల అభివృద్ధి, బడులు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు వెచ్చించాలన్నారు. హక్కుల సాధన కోసం నిరుద్యోగ యువత ముందుకు రావాలని, వారికి బిసీవై పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎం.డి. జావేద్, కార్యదర్శులు పి. శ్రీనివాస్, అడేపు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News