పరిశ్రమల్లో స్థానికులకు 70% ఉద్యోగాలు ఇవ్వాలి
పరిశ్రమల్లో స్థానికులకు 70% ఉద్యోగాలు ఇవ్వాలి
K.RAVI
బిసీవై పార్టీ ప్యాక్ సభ్యుడు శ్రీనివాస్ యాదవ్
చౌటుప్పల్ మండల పరిధిలోని పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు 70 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, లేనిపక్షంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమాలు చేపడతామని బిసీవై పార్టీ తెలంగాణ ప్యాక్ సభ్యులు డా. చిలకల శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పరిశ్రమలు స్థానిక ప్రజల భూములు, నీరు, విద్యుత్ వంటి మౌలిక వనరులను వాడుకుంటూ కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నప్పటికీ, ఉపాధి కల్పనలో తీవ్ర అలసత్వం వహిస్తున్నాయని మండిపడ్డారు. కంపెనీల ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్ల చదువుకున్న స్థానిక యువత వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిశ్రమలు సామాజిక బాధ్యతతో వ్యవహరించి స్థానికులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే కార్మిక, అగ్నిమాపక, పర్యావరణ భద్రతా నిబంధనలను పాటించని పరిశ్రమలపై అధికారులు తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) నిధులను స్థానిక గ్రామాల అభివృద్ధి, బడులు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు వెచ్చించాలన్నారు. హక్కుల సాధన కోసం నిరుద్యోగ యువత ముందుకు రావాలని, వారికి బిసీవై పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎం.డి. జావేద్, కార్యదర్శులు పి. శ్రీనివాస్, అడేపు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి