Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో పరిశ్రమల కాలుష్యంపై బీఆర్ఎస్ ఆందోళన.. కమిషనర్‌కు వినతి కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 30, 2026 01:56 PM

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ వెంకట్ రెడ్డి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ వెంకట్ రెడ్డి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ వెంకట్ రెడ్డి
July 30, 2026 11:12 AM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండల కేంద్రంలోని కంగ్టి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో గురువారం సీఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సర్కిల్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను అవసరం లేకుండా బయటకు పంపవద్దని, పాడుబడిన లేదా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, చెరువులు, వాగులు, కాలువల వద్దకు ఎవరూ వెళ్లరాదని, ముఖ్యంగా పిల్లలు, యువకులు వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే విద్యుత్ స్థంబాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, విద్యుత్ పరికరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనులకు వెళ్లినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు మోటార్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సీఐ వెంకట్ రెడ్డి ప్రజలను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News