భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ వెంకట్ రెడ్డి
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ వెంకట్ రెడ్డి
Krishna
కంగ్టి మండల కేంద్రంలోని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గురువారం సీఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సర్కిల్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను అవసరం లేకుండా బయటకు పంపవద్దని, పాడుబడిన లేదా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, చెరువులు, వాగులు, కాలువల వద్దకు ఎవరూ వెళ్లరాదని, ముఖ్యంగా పిల్లలు, యువకులు వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే విద్యుత్ స్థంబాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, విద్యుత్ పరికరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనులకు వెళ్లినప్పుడు ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు మోటార్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సీఐ వెంకట్ రెడ్డి ప్రజలను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి