'మా ఫిర్యాదును పట్టించుకోలేదు'.. నార్కెట్పల్లి ఎస్సైపై బాధిత కుటుంబం ఆరోపణలు
'మా ఫిర్యాదును పట్టించుకోలేదు'.. నార్కెట్పల్లి ఎస్సైపై బాధిత కుటుంబం ఆరోపణలు
Komidala Mahender reddy
నార్కెట్పల్లి:
నార్కెట్పల్లి ఎస్సై వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపి తక్షణ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు తంగేళ్ల రజిత, ఆమె కుమారుడు డిమాండ్ చేశారు. తమపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదు చేసినప్పటికీ ప్రత్యర్థుల ఫిర్యాదుకే ప్రాధాన్యం ఇచ్చారని వారు ఆరోపించారు. గాయపడిన తన భర్తకు వెంటనే వైద్య చికిత్స అందించకుండా పోలీస్ స్టేషన్లోనే ఉంచడంతో ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని రజిత తెలిపారు. అధికార పార్టీ అండతో నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించిన బాధిత కుటుంబం, జూలై 25న వ్యవసాయ భూమిలో బోరు తవ్వకాల సందర్భంగా ఈ దాడి జరిగిందని వెల్లడించింది. దాడికి పాల్పడిన వారితో పాటు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన నార్కెట్పల్లి ఎస్సైపై శాఖాపరమైన విచారణ జరిపి, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి