Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 30, 2026 05:51 PM

భారీ వర్షాలపై రామన్నపేట పోలీసుల హెచ్చరిక. జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఐ గోపాతి సతీష్

భారీ వర్షాలపై రామన్నపేట పోలీసుల హెచ్చరిక. జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఐ గోపాతి సతీష్

భారీ వర్షాలపై రామన్నపేట పోలీసుల హెచ్చరిక.  జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఐ గోపాతి సతీష్
July 30, 2026 03:54 PM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రామన్నపేట ఎస్‌ఐ గోపాతి సతీష్ సూచించారు. వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున వాటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని హెచ్చరించారు.

నీటితో నిండిన రహదారులపై వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ప్రయాణించాలని, ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని, పిల్లలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని కోరారు. అలాగే వాతావరణ శాఖ, జిల్లా యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఆలస్యం చేయకుండా 100 (పోలీస్), 101 (అగ్నిమాపక), 108 (అంబులెన్స్), 1077 (విపత్తు నిర్వహణ) హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని, అవసరమైన సహాయం కోసం రామన్నపేట పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని ఎస్‌ఐ గోపాతి సతీష్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News