భారీ వర్షాలపై రామన్నపేట పోలీసుల హెచ్చరిక. జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ గోపాతి సతీష్
భారీ వర్షాలపై రామన్నపేట పోలీసుల హెచ్చరిక. జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ గోపాతి సతీష్
Editor Desk
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రామన్నపేట ఎస్ఐ గోపాతి సతీష్ సూచించారు. వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున వాటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని హెచ్చరించారు.
నీటితో నిండిన రహదారులపై వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ప్రయాణించాలని, ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని, పిల్లలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని కోరారు. అలాగే వాతావరణ శాఖ, జిల్లా యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఆలస్యం చేయకుండా 100 (పోలీస్), 101 (అగ్నిమాపక), 108 (అంబులెన్స్), 1077 (విపత్తు నిర్వహణ) హెల్ప్లైన్ నంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని, అవసరమైన సహాయం కోసం రామన్నపేట పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని ఎస్ఐ గోపాతి సతీష్ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి