పార్కు స్థలాన్ని పరిరక్షించాలి.. అధికారుల నిర్లక్ష్యంపై నవీన్ రెడ్డి ఆవేదన
పార్కు స్థలాన్ని పరిరక్షించాలి.. అధికారుల నిర్లక్ష్యంపై నవీన్ రెడ్డి ఆవేదన
Komidala Mahender reddy
తట్టి అన్నారం 2బీహెచ్కే సముదాయంలో పార్కు స్థలాన్ని మతపరమైన వినియోగానికి ఉపయోగించొద్దని విజ్ఞప్తి.
హైదరాబాద్, తట్టి అన్నారం:
తట్టి అన్నారం ప్రాంతంలోని 2బీహెచ్కే గృహ సముదాయంలో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని ప్రజల వినియోగానికే పరిమితం చేయాలని స్థానిక సామాజిక కార్యకర్త నవీన్ రెడ్డి వరకాంతం డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం నిర్మించిన 1,268 ఫ్లాట్ల సముదాయంలో రంజాన్ మాసం సందర్భంగా తాత్కాలికంగా ప్రార్థనలు నిర్వహించేందుకు 30 రోజుల అనుమతి తీసుకున్నప్పటికీ, గడువు ముగిసిన తర్వాత కూడా ఆ ఏర్పాట్లను తొలగించలేదని ఆయన ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు నాగోల్ పోలీస్ స్టేషన్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పార్కు స్థలం అనేది చిన్నారులు, మహిళలు, వృద్ధులు వినియోగించేందుకు ఉద్దేశించిన ప్రజా స్థలమని, దానిని ఏ మతపరమైన లేదా ఇతర శాశ్వత కార్యకలాపాలకు వినియోగించకుండా పరిరక్షించాలని నవీన్ రెడ్డి కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పార్కు స్థలాన్ని అసలు ప్రయోజనానికే ఉపయోగించేలా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
స్థానికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పార్కు స్థలాన్ని పరిరక్షించాలని నవీన్ రెడ్డి వరకాంతం అధికారులను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి