Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పార్కు స్థలాన్ని పరిరక్షించాలి.. అధికారుల నిర్లక్ష్యంపై నవీన్ రెడ్డి ఆవేదన కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 30, 2026 07:38 PM

పార్కు స్థలాన్ని పరిరక్షించాలి.. అధికారుల నిర్లక్ష్యంపై నవీన్ రెడ్డి ఆవేదన

పార్కు స్థలాన్ని పరిరక్షించాలి.. అధికారుల నిర్లక్ష్యంపై నవీన్ రెడ్డి ఆవేదన

పార్కు స్థలాన్ని పరిరక్షించాలి.. అధికారుల నిర్లక్ష్యంపై నవీన్ రెడ్డి ఆవేదన
July 30, 2026 05:51 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తట్టి అన్నారం 2బీహెచ్‌కే సముదాయంలో పార్కు స్థలాన్ని మతపరమైన వినియోగానికి ఉపయోగించొద్దని విజ్ఞప్తి.


హైదరాబాద్, తట్టి అన్నారం:

తట్టి అన్నారం ప్రాంతంలోని 2బీహెచ్‌కే గృహ సముదాయంలో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని ప్రజల వినియోగానికే పరిమితం చేయాలని స్థానిక సామాజిక కార్యకర్త నవీన్ రెడ్డి వరకాంతం డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వం నిర్మించిన 1,268 ఫ్లాట్ల సముదాయంలో రంజాన్ మాసం సందర్భంగా తాత్కాలికంగా ప్రార్థనలు నిర్వహించేందుకు 30 రోజుల అనుమతి తీసుకున్నప్పటికీ, గడువు ముగిసిన తర్వాత కూడా ఆ ఏర్పాట్లను తొలగించలేదని ఆయన ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు నాగోల్ పోలీస్ స్టేషన్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పార్కు స్థలం అనేది చిన్నారులు, మహిళలు, వృద్ధులు వినియోగించేందుకు ఉద్దేశించిన ప్రజా స్థలమని, దానిని ఏ మతపరమైన లేదా ఇతర శాశ్వత కార్యకలాపాలకు వినియోగించకుండా పరిరక్షించాలని నవీన్ రెడ్డి కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పార్కు స్థలాన్ని అసలు ప్రయోజనానికే ఉపయోగించేలా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

స్థానికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పార్కు స్థలాన్ని పరిరక్షించాలని నవీన్ రెడ్డి వరకాంతం అధికారులను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News