నేడు ఇందిరా పార్క్ వద్ద తపస్ మహాధర్నాకు తరలిరండి. జిల్లా ఉపాధ్యాయులకు కోట్ల కాశీరావు, పూజారి రమేశ్
నేడు ఇందిరా పార్క్ వద్ద తపస్ మహాధర్నాకు తరలిరండి. జిల్లా ఉపాధ్యాయులకు కోట్ల కాశీరావు, పూజారి రమేశ్
Editor Desk
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద శనివారం నిర్వహించనున్న తపస్ మహాధర్నాను విజయవంతం చేయాలని తపస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు, ప్రధాన కార్యదర్శి పూజారి రమేశ్ జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ మహాధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల మంజూరు, ఎస్ఎస్ఏ ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనాలు చెల్లింపు, కనీస వేతన స్కేలు అమలు తదితర ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు.
అలాగే జీవో నెం.25 సవరణ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్ధతి అమలు, గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారం, విద్యాశాఖలో జీవో 190 అమలు, 317 బాధితులకు ఉపశమనం, 2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్, టెట్ అర్హత మార్కులను 40 శాతానికి నిర్ణయించడం, విద్యాసంస్థలకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిధుల విడుదల వంటి డిమాండ్ల సాధన కోసం ప్రతి ఉపాధ్యాయుడు మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి