Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీడీఎంఏ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 31, 2026 09:15 PM

నేడు ఇందిరా పార్క్ వద్ద తపస్ మహాధర్నాకు తరలిరండి. జిల్లా ఉపాధ్యాయులకు కోట్ల కాశీరావు, పూజారి రమేశ్

నేడు ఇందిరా పార్క్ వద్ద తపస్ మహాధర్నాకు తరలిరండి. జిల్లా ఉపాధ్యాయులకు కోట్ల కాశీరావు, పూజారి రమేశ్

నేడు ఇందిరా పార్క్ వద్ద తపస్ మహాధర్నాకు తరలిరండి. జిల్లా ఉపాధ్యాయులకు కోట్ల కాశీరావు, పూజారి రమేశ్
July 31, 2026 07:07 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద శనివారం నిర్వహించనున్న తపస్ మహాధర్నాను విజయవంతం చేయాలని తపస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు, ప్రధాన కార్యదర్శి పూజారి రమేశ్ జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ మహాధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల మంజూరు, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనాలు చెల్లింపు, కనీస వేతన స్కేలు అమలు తదితర ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు.

అలాగే జీవో నెం.25 సవరణ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్ధతి అమలు, గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారం, విద్యాశాఖలో జీవో 190 అమలు, 317 బాధితులకు ఉపశమనం, 2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్, టెట్ అర్హత మార్కులను 40 శాతానికి నిర్ణయించడం, విద్యాసంస్థలకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిధుల విడుదల వంటి డిమాండ్ల సాధన కోసం ప్రతి ఉపాధ్యాయుడు మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News