గ్రామ భద్రతకు సీసీ కెమెరాలే కవచం- డిఎస్పీ మధుసూదన్ రెడ్డి
గ్రామ భద్రతకు సీసీ కెమెరాలే కవచం- డిఎస్పీ మధుసూదన్ రెడ్డి
K.RAVI
చిన్న కొండూర్ లో నిఘా నేత్రాల ప్రారంభం
నేరాల నివారణతో పాటు గ్రామంలో శాంతిభద్రతలను కాపాడటంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం చిన్న కొండూర్ గ్రామంలో చౌటుప్పల్ పోలీసుల సమక్షంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, సీఐ జి. మన్మధ్ కుమార్, ఎస్ఐ ఎస్. కృష్ణ మాల్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ... దొంగతనాలు, ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలపై నిరంతరం కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా ఉంటుందన్నారు. నిఘా నేత్రాలు గ్రామానికి కళ్ల లాంటివని, ప్రజల్లో భద్రతా భావనను పెంపొందిస్తాయని చెప్పారు. "ప్రజల సహకారమే పోలీసుల బలం" అని, గ్రామాన్ని సురక్షితంగా ఉంచుకోవడంలో చౌటుప్పల్ పోలీసులకు గ్రామ పంచాయతీ, ప్రజలు అందిస్తున్న సహకారం ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి