ఒకే సర్టిఫికెట్తో కుటుంబానికి ప్రభుత్వ గుర్తింపు! తెలంగాణలో 'ఫ్యామిలీ సర్టిఫికెట్' జారీ ప్రారంభం
ఒకే సర్టిఫికెట్తో కుటుంబానికి ప్రభుత్వ గుర్తింపు! తెలంగాణలో 'ఫ్యామిలీ సర్టిఫికెట్' జారీ ప్రారంభం
Editor Desk
హైదరాబాద్, జూలై 31 : రాష్ట్రంలో పౌర సేవలను మరింత సులభతరం చేయడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 'ఫ్యామిలీ సర్టిఫికెట్' జారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ ప్రభుత్వ సేవలు పొందేందుకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రజలు తమకు సమీపంలోని తహశీల్దార్ (ఎంఆర్వో) కార్యాలయాలు లేదా మీసేవా కేంద్రాల ద్వారా ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
ఈ సర్టిఫికెట్లో కుటుంబ సభ్యుల పేర్లు, వారి పరస్పర సంబంధాలు తదితర అధికారిక వివరాలు నమోదు చేయబడతాయి. ప్రభుత్వ శాఖల్లో కుటుంబ వివరాల ధ్రువీకరణ అవసరమయ్యే అన్ని సందర్భాల్లో ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ఈ విధానం అమలుతో ప్రజలు ఒకే ధ్రువపత్రం ద్వారా వివిధ ప్రభుత్వ సేవలను సులభంగా పొందే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి