నాలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులను అభినందించిన మల్కాజిగిరి కమిషనర్ బి. సుమతి
నాలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులను అభినందించిన మల్కాజిగిరి కమిషనర్ బి. సుమతి
Editor Desk
డయల్-100 సమాచారంపై నాలుగు నిమిషాల్లో స్పందించిన చైతన్యపురి పోలీసులు.. తల్లి, ముగ్గురు చిన్నారుల రక్షణ
హైదరాబాద్, జూలై 31
డయల్-100కు వచ్చిన అత్యవసర సమాచారంపై వేగంగా స్పందించి తల్లి, ఆమె ముగ్గురు చిన్నారుల ప్రాణాలను కాపాడిన చైతన్యపురి పోలీసు సిబ్బందిని బి. సుమతి అభినందించారు.
డయల్-100కు సమాచారం అందిన వెంటనే చైతన్యపురి పెట్రోల్ మొబైల్-1 బృందం కేవలం నాలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుంది. డబ్ల్యూపీసీ ఎం. చంద్రకళ, హోంగార్డ్ జె. బాలరాజు హైడ్రా బృందంతో కలిసి ముసీ నదిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్న మహిళతో పాటు ఆమె ముగ్గురు చిన్నారులను సురక్షితంగా రక్షించారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
విధి నిర్వహణలో అసాధారణ సమయస్ఫూర్తి, అప్రమత్తత ప్రదర్శించి నాలుగు ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బంది సేవలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ప్రశంసించారు. ప్రజల ప్రాణాల రక్షణలో ఇలాంటి సేవాభావంతో విధులు నిర్వర్తించాలని ఆమె సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి