Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ద్విచక్రవాహనంపై వెళ్తూ.. అసలు (Original) స్థల పత్రాలు పోగొట్టుకున్న మహిళ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 01, 2026 08:27 AM

టీటీడీ భూమిపై కబ్జా నీడ..! వెంచర్ పేరుతో ప్లాట్ల విక్రయాలు?

టీటీడీ భూమిపై కబ్జా నీడ..! వెంచర్ పేరుతో ప్లాట్ల విక్రయాలు?

టీటీడీ భూమిపై కబ్జా నీడ..! వెంచర్ పేరుతో ప్లాట్ల విక్రయాలు?
August 01, 2026 05:55 AM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

​ప్రజల విశ్వాసానికి ప్రతీకగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం భూమిపై ఆక్రమణల నీడలు కమ్ముకున్నాయి. సుమారు రెండు దశాబ్దాల క్రితం స్వామివారి కళ్యాణమండపం నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని, ప్రస్తుతం కొందరు వ్యక్తులు తమ ఆధీనంలోకి తీసుకుని వెంచర్‌గా మార్చి ప్లాట్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.


​అసలేం జరిగింది.


​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 649లో టీటీడీ కళ్యాణమండపం నిర్మాణం కోసం సుమారు 22 సంవత్సరాల క్రితం భూమిని విక్రయించారు. 2024లో ఈ భూమిలో అక్రమ నిర్మాణం జరగగా ఆ నిర్మాణాలను గమనించిన ఈ భూమిని విక్రయించిన అసలు యజమానులు, తాము టీటీడీకి స్థలాన్ని అప్పగించినట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు సంబంధిత పత్రాలు, సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్‌కు , గుత్తా సుఖేందర్ రెడ్డికి , జిల్లా కలెక్టర్ కు , మండల రెవెన్యూ అధికారికి ఈ వినతి పత్రాన్ని సమర్పించారు.

ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కాకపోవడమే ఈ అక్రమాలకు కారణమా ?


​టీటీడీ పేరిట భూమి ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదు అనే సాంకేతిక కారణాన్ని సాకుగా చూపుతూ కొందరు వ్యక్తులు ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఎటువంటి అనుమతులు లేకపోయినా, ఆ భూమిలో ఏకంగా వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్లుగా విక్రయిస్తుండడం గమనార్హం. టీటీడీ భూమికి వెంచర్ అనుమతులు ఎలా వచ్చాయనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే వీరు సమర్పించిన వినతి పత్రాలలో దేవాలయ భూమిని ఎప్పుడూ వీలుంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తామని సదరు వ్యక్తులు ఇచ్చిన వినతి పత్రంలో తెలియజేశారు. అది కూడా గమనించకపోవడం విడ్డూరంగా అనిపిస్తోందని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు..


​అధికారుల సమగ్ర విచారణకు డిమాండ్.


​ఈ అక్రమ వ్యవహారంపై రెవెన్యూ, మున్సిపల్, టీటీడీ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భక్తుల నమ్మకంతో ముడిపడి ఉన్న టీటీడీ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. భూ యాజమాన్య హక్కులపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ఆక్రమణలు నిజమని తేలితే వెంటనే ప్లాట్ల విక్రయాలను అడ్డుకుని టీటీడీ భూమిని కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News