Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దివీస్ దాతృత్వంపై విమర్శలా? కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 01, 2026 09:54 AM

సమాచారం దాచితే జరిమానా తప్పదు. డీటీడీఓ కార్యాలయ పీఐఓపై రూ.5 వేల ఫైన్.. రాష్ట్ర సమాచార కమిషన్ కఠిన ఆదేశాలు

సమాచారం దాచితే జరిమానా తప్పదు. డీటీడీఓ కార్యాలయ పీఐఓపై రూ.5 వేల ఫైన్.. రాష్ట్ర సమాచార కమిషన్ కఠిన ఆదేశాలు

సమాచారం దాచితే జరిమానా తప్పదు. డీటీడీఓ కార్యాలయ పీఐఓపై రూ.5 వేల ఫైన్.. రాష్ట్ర సమాచార కమిషన్ కఠిన ఆదేశాలు
August 01, 2026 06:42 AM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇబ్రహీంపట్నం: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన వివరాలను గడువులోగా అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ (డీటీడీఓ) కార్యాలయ ప్రజా సమాచార అధికారిపై రాష్ట్ర సమాచార కమిషన్ కొరడా ఝళిపించింది. సంబంధిత పీఐఓకు రూ.5 వేల జరిమానా విధిస్తూ రాష్ట్ర సమాచార కమిషనర్ మొహ్సిన్ పర్వీన్ ఉత్తర్వులు జారీ చేశారు.

రంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ చట్టం–2005 ప్రకారం దరఖాస్తు ద్వారా కోరినా, నిర్ణీత గడువులోగా సమాచారం అందించలేదు. అనంతరం మొదటి అప్పీల్ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో సమాచార హక్కు చట్టం ప్రకారం ద్వితీయ అప్పీల్ దాఖలైంది.

ఈ అప్పీల్‌పై శుక్రవారం హైదరాబాద్‌లోని సమాచార హక్కు భవన్‌లో రాష్ట్ర సమాచార కమిషనర్ మొహ్సిన్ పర్వీన్ విచారణ చేపట్టారు. అప్పీలుదారుగా సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాట్రావత్ రాజు నాయక్ స్వయంగా హాజరై తన వాదనలు వినిపించారు.

విచారణ సందర్భంగా ప్రజా సమాచార అధికారి నిర్లక్ష్య వైఖరిపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వకపోవడం ద్వారా దరఖాస్తుదారుడి చట్టబద్ధ హక్కుకు భంగం కలిగిందని పేర్కొన్నారు. దీంతో సంబంధిత అధికారికి రూ.5 వేల జరిమానా విధించడంతో పాటు, వారం రోజుల్లో జరిమానా చెల్లించాలని, అప్పీలుదారు కోరిన పూర్తి సమాచారాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా వెంటనే అందజేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కాట్రావత్ రాజు నాయక్ మాట్లాడుతూ, సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసే అధికారులపై రాష్ట్ర సమాచార కమిషన్ కఠిన చర్యలు తీసుకోవడం ఆర్టీఐ చట్టం అమలుకు బలాన్నిస్తుందని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News