మూడోసారి జిల్లా కార్యదర్శిగా డాక్టర్ కిషన్
మూడోసారి జిల్లా కార్యదర్శిగా డాక్టర్ కిషన్
Editor Desk
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం (టీజీసీజీటీఏ) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. కిషన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయనను అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ.. గతంలో జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేసిన డాక్టర్ కిషన్ మూడోసారి జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం కళాశాలకు గర్వకారణమని అన్నారు. సభ్యుల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయడంతో పాటు ప్రభుత్వ ఉన్నత విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.అనంతరం అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది డాక్టర్ డి. కిషన్ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి