Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారీ వర్షంతో గోడలు, పైకప్పు కూలిన ఇల్లు.. బాధితులను పరామర్శించిన సర్పంచ్ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 01, 2026 06:44 PM

చేనేత చైతన్య మహాసభను జయప్రదం చేయండి.

చేనేత చైతన్య మహాసభను జయప్రదం చేయండి.

చేనేత చైతన్య మహాసభను జయప్రదం చేయండి.
August 01, 2026 04:11 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 5న కరీంనగర్–జగిత్యాల రోడ్డులోని పద్మశాలి భవన్‌లో తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి చేనేత చైతన్య మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి పెండెం లక్ష్మీనారాయణ, రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు బూరుగు వెంకటేశం పిలుపునిచ్చారు.

శనివారం మండల కేంద్రంతో పాటు సిరిపురం గ్రామంలో మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహాసభలో 17 మంది పద్మశాలి మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అలాగే నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల అధ్యక్షులను ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాపోలు రాజశేఖర్, సిరిపురం చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రాపోలు షణ్ముఖం, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రచ్చ యాదగిరి, సిరిపురం పద్మశాలి సంఘం అధ్యక్షుడు జెల్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ జెల్ల వెంకటేష్, మాజీ సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు, మాజీ ఎంపీటీసీలు పున్న వెంకటేశం, బడుగు రమేష్, సిల్క్ చేనేత సహకార సంఘం డైరెక్టర్ మహేశ్వరం అశోక్, చేనేత నాయకులు కైరం కొండ నందు, కొంగరి నరసింహ, గంజి అశోక్, చిందం ఉమాకాంతం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News