చేనేత చైతన్య మహాసభను జయప్రదం చేయండి.
చేనేత చైతన్య మహాసభను జయప్రదం చేయండి.
Editor Desk
రామన్నపేట,
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 5న కరీంనగర్–జగిత్యాల రోడ్డులోని పద్మశాలి భవన్లో తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి చేనేత చైతన్య మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి పెండెం లక్ష్మీనారాయణ, రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు బూరుగు వెంకటేశం పిలుపునిచ్చారు.
శనివారం మండల కేంద్రంతో పాటు సిరిపురం గ్రామంలో మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహాసభలో 17 మంది పద్మశాలి మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అలాగే నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల అధ్యక్షులను ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాపోలు రాజశేఖర్, సిరిపురం చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రాపోలు షణ్ముఖం, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రచ్చ యాదగిరి, సిరిపురం పద్మశాలి సంఘం అధ్యక్షుడు జెల్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ జెల్ల వెంకటేష్, మాజీ సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు, మాజీ ఎంపీటీసీలు పున్న వెంకటేశం, బడుగు రమేష్, సిల్క్ చేనేత సహకార సంఘం డైరెక్టర్ మహేశ్వరం అశోక్, చేనేత నాయకులు కైరం కొండ నందు, కొంగరి నరసింహ, గంజి అశోక్, చిందం ఉమాకాంతం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి