సిరిపురం జెడ్పీహెచ్ఎస్లో న్యాయ విజ్ఞాన సదస్సు.విద్యార్థులకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించిన జూనియర్ సివిల్ జడ్జి శిరీష
సిరిపురం జెడ్పీహెచ్ఎస్లో న్యాయ విజ్ఞాన సదస్సు.విద్యార్థులకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించిన జూనియర్ సివిల్ జడ్జి శిరీష
Editor Desk
రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్)లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి శిరీష ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు న్యాయ అవగాహన కల్పించారు.
భారత రాజ్యాంగ విలువలు, ప్రాథమిక విధులు, బాలల హక్కులు, బాలల రక్షణ చట్టాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పోక్సో (POCSO) చట్టం, మంచి స్పర్శ–చెడు స్పర్శ, మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ, ఉచిత న్యాయ సహాయం, న్యాయాన్ని పొందే హక్కు, సైబర్ భద్రత వంటి అంశాలను సులభంగా అర్థమయ్యేలా వివరించారు.
అనంతరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ సుక్క శ్రవణ్ కుమార్ విద్యార్థులకు చట్టపరమైన హక్కులు, బాధ్యతలు, సైబర్ నేరాల నుంచి రక్షణ, బాలల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చి చట్టాలపై ఆసక్తి పెంపొందించారు.
కార్యక్రమం ముగింపులో జూనియర్ సివిల్ జడ్జి శిరీష విద్యార్థులను వివిధ అంశాలపై ప్రశ్నించి, సరైన సమాధానాలు చెప్పిన వారికి ప్రోత్సాహకంగా పెన్నులు బహూకరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ సభ్యుడు శ్రీశైలం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి సదస్సులు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి