Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆందోల్‌ మైసమ్మ క్షేత్రంలో కన్నులపండువగా బోనాల ఉత్సవాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 01, 2026 08:06 PM

సిరిపురం జెడ్పీహెచ్‌ఎస్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు.విద్యార్థులకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించిన జూనియర్ సివిల్ జడ్జి శిరీష

సిరిపురం జెడ్పీహెచ్‌ఎస్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు.విద్యార్థులకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించిన జూనియర్ సివిల్ జడ్జి శిరీష

సిరిపురం జెడ్పీహెచ్‌ఎస్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు.విద్యార్థులకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించిన జూనియర్ సివిల్ జడ్జి శిరీష
August 01, 2026 05:42 PM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్)లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి శిరీష ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు న్యాయ అవగాహన కల్పించారు.

భారత రాజ్యాంగ విలువలు, ప్రాథమిక విధులు, బాలల హక్కులు, బాలల రక్షణ చట్టాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పోక్సో (POCSO) చట్టం, మంచి స్పర్శ–చెడు స్పర్శ, మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ, ఉచిత న్యాయ సహాయం, న్యాయాన్ని పొందే హక్కు, సైబర్ భద్రత వంటి అంశాలను సులభంగా అర్థమయ్యేలా వివరించారు.

అనంతరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ సుక్క శ్రవణ్ కుమార్ విద్యార్థులకు చట్టపరమైన హక్కులు, బాధ్యతలు, సైబర్ నేరాల నుంచి రక్షణ, బాలల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చి చట్టాలపై ఆసక్తి పెంపొందించారు.

కార్యక్రమం ముగింపులో జూనియర్ సివిల్ జడ్జి శిరీష విద్యార్థులను వివిధ అంశాలపై ప్రశ్నించి, సరైన సమాధానాలు చెప్పిన వారికి ప్రోత్సాహకంగా పెన్నులు బహూకరించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ సభ్యుడు శ్రీశైలం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి సదస్సులు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News