Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ మార్గంలో ఘోర ప్రమాదం.. బైక్ అదుపు తప్పి ఇద్దరి మృతి కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 01, 2026 09:16 PM

ఆందోల్‌ మైసమ్మ క్షేత్రంలో కన్నులపండువగా బోనాల ఉత్సవాలు

ఆందోల్‌ మైసమ్మ క్షేత్రంలో కన్నులపండువగా బోనాల ఉత్సవాలు

ఆందోల్‌ మైసమ్మ క్షేత్రంలో కన్నులపండువగా బోనాల ఉత్సవాలు
August 01, 2026 07:06 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తొలిరోజు ఘనంగా అఖండ దీపారాధన, గణపతి పూజ

మండల పరిధిలోని ప్రసిద్ధ శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానంలో 21వ బోనాల ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయంలో అఖండ దీపారాధన, గణపతి పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ (ఏసీ) కె. భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈవో) సల్వాది మోహన్ బాబు, కంచర్ల అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ... ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వద్ద అన్ని రకాల మౌలిక వసతులు, క్యూలైన్లు, తాగునీటి సదుపాయాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

తొలిరోజు దేవస్థానానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు దాతలు కొమిరిశెట్టి విజయ్ కుమార్ - శిరీష దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని సమకూర్చారు.​ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఈడుదుల బాబు, బేతాళ నరసింహ, సిద్దిపేట ఆనందరెడ్డి, వెంకిర్యాల శివ, బాలగోని శ్రీకాంత్ గౌడ్, బొంతల యువరాజ్, మన్నే మహేందర్ రెడ్డి, దౌడీ రాజేష్, పన్నాల మహేందర్ రెడ్డి, ధేప రాజీవ, పంతంగి రమేష్, జొన్నగంటి దాసు, చిట్టెంపల్లి సబిత, వల్లూరి శివప్రసాద్ శర్మ, గ్రామ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News