ఆందోల్ మైసమ్మ క్షేత్రంలో కన్నులపండువగా బోనాల ఉత్సవాలు
ఆందోల్ మైసమ్మ క్షేత్రంలో కన్నులపండువగా బోనాల ఉత్సవాలు
K.RAVI
తొలిరోజు ఘనంగా అఖండ దీపారాధన, గణపతి పూజ
మండల పరిధిలోని ప్రసిద్ధ శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానంలో 21వ బోనాల ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయంలో అఖండ దీపారాధన, గణపతి పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ (ఏసీ) కె. భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈవో) సల్వాది మోహన్ బాబు, కంచర్ల అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ... ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వద్ద అన్ని రకాల మౌలిక వసతులు, క్యూలైన్లు, తాగునీటి సదుపాయాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
తొలిరోజు దేవస్థానానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు దాతలు కొమిరిశెట్టి విజయ్ కుమార్ - శిరీష దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని సమకూర్చారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఈడుదుల బాబు, బేతాళ నరసింహ, సిద్దిపేట ఆనందరెడ్డి, వెంకిర్యాల శివ, బాలగోని శ్రీకాంత్ గౌడ్, బొంతల యువరాజ్, మన్నే మహేందర్ రెడ్డి, దౌడీ రాజేష్, పన్నాల మహేందర్ రెడ్డి, ధేప రాజీవ, పంతంగి రమేష్, జొన్నగంటి దాసు, చిట్టెంపల్లి సబిత, వల్లూరి శివప్రసాద్ శర్మ, గ్రామ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి