ఆర్టీసీలో సుదీర్ఘ కాలం సేవలందించి, క్రమశిక్షణ గల డ్రైవర్గా పేరు తెచ్చుకున్న చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామానికి చెందిన బొంగు నర్సింహా గౌడ్ సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. విధి నిర్వహణలో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, ఎలాంటి ప్రమాదాలు లేకుండా బస్సు నడిపినందుకు గానూ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన రెండు సార్లు ‘ఉత్తమ డ్రైవర్’ అవార్డులను అందుకున్నారు.
రిటైర్మెంట్ తర్వాత కూడా గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉంటూ, యువతకు ఆదర్శంగా నిలిచిన నర్సింహా గౌడ్ మృతి పట్ల గ్రామస్తులు, ఆర్టీసీ సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి