PRINT TIME: August 01, 2026 10:44 PM
కోదాడ మార్గంలో ఘోర ప్రమాదం.. బైక్ అదుపు తప్పి ఇద్దరి మృతి
కోదాడ మార్గంలో ఘోర ప్రమాదం.. బైక్ అదుపు తప్పి ఇద్దరి మృతి
August 01, 2026 08:55 PM
9 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్ర శివారులోని కవిత కాలేజీ సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కోదాడ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అతివేగంతో ప్రయాణిస్తుండగా, వాహనం నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా ముందు బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో ఇద్దరూ రహదారిపై బలంగా పడిపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి