Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ పట్టణంలో వాహనాల ముమ్మర తనిఖీ 50 వాహనాలు సీజ్ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 01, 2026 11:38 PM

యువకుడి మృతిపై ఆగ్రహం.. వట్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు

యువకుడి మృతిపై ఆగ్రహం.. వట్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు

యువకుడి మృతిపై ఆగ్రహం.. వట్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు
August 01, 2026 09:46 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప (22) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతుడి కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని దించారని ఆరోపిస్తూ గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో వట్పల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆగ్రహానికి గురైన కొందరు పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి ఫర్నీచర్, కిటికీల అద్దాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీరప్ప మృతిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News