Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సన్మాన సభలో సర్పంచ్ పద్మావతి.. గ్రామాభివృద్ధికి అందరి సహకారం కోరారు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 01, 2026 03:25 PM

ప్రభుత్వం హామీలు అమలు చేయాలి: తపస్ నాయకుల డిమాండ్

ప్రభుత్వం హామీలు అమలు చేయాలి: తపస్ నాయకుల డిమాండ్

ప్రభుత్వం హామీలు అమలు చేయాలి: తపస్ నాయకుల డిమాండ్
August 01, 2026 01:47 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) పిలుపు మేరకు నారాయణఖేడ్ డివిజన్ పరిధికి చెందిన ఉపాధ్యాయులు శనివారం "ఛలో హైదరాబాద్" మహా ధర్నాకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్సీ గడువు ముగిసినా కొత్త పీఆర్సీ ప్రకటించలేదని తెలిపారు. ఎన్నికల హామీ ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, 100 విడతల ఏరియర్స్, జీపీఎఫ్ బకాయిలు, సరెండర్ బిల్లులు, హెల్త్ కార్డులు తదితర పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మూడు సంవత్సరాలు గడిచినా ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమని, ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని డిమాండ్లను నెరవేర్చాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర సేవా కో-కన్వీనర్ చంద్రశేఖర్, జిల్లా నాయకులు వినయ్, లక్ష్మణ్, రామకృష్ణ, డివిజన్ అధ్యక్షుడు జగదీశ్వర్, మండలాల బాధ్యులు మచ్చందర్, మహేశ్, సంతోష్ రెడ్డి, రంజిత్, శ్రీను, ఓం బసవ, రతన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News