బాధిత కాంగ్రెస్ కార్యకర్తకు ఆర్థిక సాయం
బాధిత కాంగ్రెస్ కార్యకర్తకు ఆర్థిక సాయం
K.RAVI
ఇటీవల ప్రమాదవశాత్తూ కాలుకు గాయమై ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను సీనియర్ నాయకులు పరామర్శించి ఆర్థికంగా చేయూతనందించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 19వ వార్డుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త బాతరాజు రమేష్ కాలు గాయంతో బాధపడుతున్నారని తెలుసుకున్న వార్డు సీనియర్ నాయకుడు వర్కాల రాము గౌడ్ ఆదివారం ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా రమేష్ కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని, తక్షణ సహాయంగా ఆర్థిక సాయాన్ని అందజేశారు. రాబోయే రోజుల్లో కూడా కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ముందుండి ఆదుకుంటానని ఈ సందర్భంగా రాము గౌడ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పబ్బు సత్యం, గుర్రం శ్రీనివాస్ నేత, ఐఎన్టీయూసీ బ్లాక్ అధ్యక్షుడు కంచర్ల జంగయ్య, నాయకులు వెల్తూరి రాజేష్, బషీర్, వర్కాల ప్రసాద్, మధు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి