Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈవో ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారు: సర్పంచ్‌ నిరంజన్‌ గౌడ్‌ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 02, 2026 11:01 PM

స్నేహమంటే ఇదేరా..! 25 ఏళ్లుగా చెక్కుచెదరని ‘కలం స్నేహితుల’ అనుబంధం.

స్నేహమంటే ఇదేరా..! 25 ఏళ్లుగా చెక్కుచెదరని ‘కలం స్నేహితుల’ అనుబంధం.

స్నేహమంటే ఇదేరా..!  25 ఏళ్లుగా చెక్కుచెదరని ‘కలం స్నేహితుల’ అనుబంధం.
August 02, 2026 08:11 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్నేహితుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఆత్మీయ సమ్మేళనం.

హైదరాబాద్, ఆగస్టు 2 (స్థానికం ప్రతినిధి):

కాలం మారినా, సాంకేతికత పెరిగినా నిజమైన స్నేహానికి కాలపరిమితి ఉండదని ‘కలం స్నేహితులు’ మరోసారి నిరూపించారు. దాదాపు 25 ఏళ్ల క్రితం వండర్ వరల్డ్ మాసపత్రికలో నిర్వహించిన ‘కలం స్నేహం’ శీర్షిక ద్వారా ఉత్తరాల ద్వారా పరిచయమైన సుమారు 35 మంది నేటికీ తమ అనుబంధాన్ని కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

సోషల్ మీడియా లేని రోజుల్లో దినపత్రికలు, మాసపత్రికలు, సాహిత్య వేదికలే పరిచయాలకు వారధిగా నిలిచేవి. ఆ సమయంలో వండర్ వరల్డ్ మాసపత్రికలోని ‘కలం స్నేహం’ విభాగం ద్వారా ఏర్పడిన పరిచయాలు క్రమంగా స్నేహంగా మారాయి. అనంతరం శరత్ ఆధ్వర్యంలో ‘కలం స్నేహం అసోసియేషన్’ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక ప్రాంతంలో సమావేశమవుతూ పరస్పర యోగక్షేమాలు తెలుసుకుంటూ వస్తున్నారు.

ఈ అసోసియేషన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సభ్యులు ఉన్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ఆగస్టు మొదటి ఆదివారం హైదరాబాద్‌లోని నాగోల్‌లో సుమారు 22 మంది స్నేహితులు ఆత్మీయంగా కలుసుకున్నారు.

తిరుపతి, కడప, కర్నూలు, నిజామాబాద్, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సంతోషంగా గడిపారు. ఉత్తరాలతో ప్రారంభమైన ఈ స్నేహబంధం పాతికేళ్లుగా కొనసాగుతుండడం విశేషమని సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు సన్మానించుకుని భవిష్యత్తులోనూ ఇదే అనుబంధాన్ని కొనసాగించాలని సంకల్పించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News